ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథం పై NATS ట్రైనింగ్
- April 17, 2023
తెలుగు భాష గొప్పదనం గురించి అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్ నిర్వహించింది. ప్రాచీన సాహిత్యంలోని శాస్త్రీయమైన అంశాలను ప్రముఖ రచయిత, అధ్యాపకులు, తెలుగు అకాడమి సభ్యులైన డాక్టర్ కప్పగంతు రామకృష్ణ వివరించారు. మహాభారత కావ్యంలో నేటికి పనికి వచ్చే ఆధునిక అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఆ అంశాలను విడమరిచి చెప్పారు.. భాగవతంలో శ్రీ కృష్ణుడు పర్యావరణ పరిరక్షణ అనేది ఎలా చేశారు..? అనేది కప్పగంతు రామకృష్ణ తెలిపారు. ప్రాచీన సాహిత్యాన్ని మనం చూసే దృష్టి కోణం మార్చుకుంటే ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చని.. వాటిని నేటి సమాజానికి అన్వయించుకోవచ్చని తెలిపారు. సమాజంలో యువత పెడదోవ పెట్టకుండా ఉండాలంటే ప్రాచీన సాహిత్యాన్ని సరైన కోణంలో అధ్యయనం చేయాలని సూచించారు. మహాభారతం చదివితే అది వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తుందని కప్పగంతు రామకృష్ణ అన్నారు. తెలుగు భాష మాధుర్యాన్ని తెలుగువారికి గుర్తు చేసేందుకు నాట్స్ తన వంతు కృషి ఎప్పుడూ చేస్తుంటుందని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ లలితా కళా వేదిక ద్వారా తెలుగు భాష ప్రత్యేకత ఏమిటినేది నేటితరం..రేపటి తరం తెలుసుకునేలా నాట్స్ సదస్సులు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు)నూతి తెలిపారు.ఈ సదస్సుకు వ్యాఖ్యాతలుగా నాట్స్ నాయకులు శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, మురళీకృష్ణ మేడిచెర్ల వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









