8శాతం వృద్ధిని సాధించిన సలాలా, సోహర్, దుక్మ్ ఓడరేవులు
- April 18, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లో కీలకమైన సలాలా, సోహర్, దుక్మ్ ఓడరేవులు 8 శాతం వృద్ధిని సాధించాయి. 2022లో 62.3 మిలియన్ టన్నులకు పైగా సాధారణ కార్గోను కార్యకలాపాలను నిర్వహించాయి. కాగా 2021లో వృద్ధి రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. అయితే, లిక్విడ్ కార్గో హ్యాండిల్ విషయంలో 22 శాతం వృద్ధిని సాధించాయి. 2022లో 23.7 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా లిక్విడ్ కార్గో హ్యాండిల్ చేశాయి. మూడు ఓడరేవులలో నిర్వహించిన కంటైనర్ల సంఖ్య దాదాపు 5.2 మిలియన్ TEUలుగా ఉంది. 2022లో 6,500 కంటే ఎక్కువ ఓడలు పోర్టులలో కార్యకలాపాలు నిర్వహించాయి.
ప్రపంచ బ్యాంక్ జారీ చేసిన “కంటైనర్ పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021” నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంటైనర్ పోర్ట్ల ర్యాంకింగ్స్లో సలాలా పోర్ట్ రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, ఓడరేవులో ఒక రోజులో నిర్వహించబడిన కంటైనర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 1157 కంటైనర్లకు చేరుకుంది. మరోవైపు, సోహార్ పోర్ట్ 2022లో సింగపూర్, మలేషియా పోర్ట్ల నుండి 100 శాతం పూర్తి ఆక్యుపెన్సీ రేటుతో "ASYAD లైన్స్" ద్వారా మొదటి బ్యాచ్ కంటైనర్లను అందుకుంది. ఇది ఈ లైన్ కోసం మాత్రమే 100,000 TEUల అంచనా వార్షిక ఆపరేటింగ్ వాల్యూమ్ని నమోదుచేసింది.
తాజా వార్తలు
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం







