తేజు కమిట్మెంట్కి ఎలాంటి రిజల్ట్ రానుందో.!
- April 20, 2023
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ పరిస్థితిని గురించి ఆయన సన్నిహితులు, బంధువులు ఇప్పటికే చాలా చెప్పారు. ‘విరూపాక్ష’ ప్రమోషన్లలో భాగంగా స్వయంగా తేజు అప్పటి పరిస్థితుల్ని తలచుకుంటూ ఫ్యాన్స్కి జాగ్రత్తలు చెబుతూనే తాను అనుభవించిన బాధను వివరిస్తుండడం నిజంగా మనసుకు కదిలించి వేస్తోంది.
ఇక ‘విరూపాక్ష’ సినిమా తేజుకి వెరీ వెరీ స్పెషల్ మూవీ. దాదాపు తేజుకిది యాక్సిడెంట్ తర్వాత పునర్జన్మగానే పరిగణించొచ్చు. ఈ తరుణంలో ఆయన నుంచి వస్తున్న ‘విరూపాక్ష’ సినిమాని కొత్త కోణంలో చూడాలంటున్నారు మేకర్లు.
అవును నిజమే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా తెరకెక్కిన సినిమా ఇది. సుకుమార్ అందించిన కథతో కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ఆరోగ్యం సపోర్ట్ చేయకున్నా.. కమిట్మెంట్తో ఏదో చేయాలన్న కసితో తేజు ఈ సినిమా పూర్తి చేశాడు. రిజల్ట్ ఏమొస్తుందో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 21) ‘విరూపాక్ష’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!







