తేజు కమిట్మెంట్కి ఎలాంటి రిజల్ట్ రానుందో.!
- April 20, 2023
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ పరిస్థితిని గురించి ఆయన సన్నిహితులు, బంధువులు ఇప్పటికే చాలా చెప్పారు. ‘విరూపాక్ష’ ప్రమోషన్లలో భాగంగా స్వయంగా తేజు అప్పటి పరిస్థితుల్ని తలచుకుంటూ ఫ్యాన్స్కి జాగ్రత్తలు చెబుతూనే తాను అనుభవించిన బాధను వివరిస్తుండడం నిజంగా మనసుకు కదిలించి వేస్తోంది.
ఇక ‘విరూపాక్ష’ సినిమా తేజుకి వెరీ వెరీ స్పెషల్ మూవీ. దాదాపు తేజుకిది యాక్సిడెంట్ తర్వాత పునర్జన్మగానే పరిగణించొచ్చు. ఈ తరుణంలో ఆయన నుంచి వస్తున్న ‘విరూపాక్ష’ సినిమాని కొత్త కోణంలో చూడాలంటున్నారు మేకర్లు.
అవును నిజమే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా తెరకెక్కిన సినిమా ఇది. సుకుమార్ అందించిన కథతో కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ఆరోగ్యం సపోర్ట్ చేయకున్నా.. కమిట్మెంట్తో ఏదో చేయాలన్న కసితో తేజు ఈ సినిమా పూర్తి చేశాడు. రిజల్ట్ ఏమొస్తుందో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 21) ‘విరూపాక్ష’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







