తేజు కమిట్మెంట్కి ఎలాంటి రిజల్ట్ రానుందో.!
- April 20, 2023
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ పరిస్థితిని గురించి ఆయన సన్నిహితులు, బంధువులు ఇప్పటికే చాలా చెప్పారు. ‘విరూపాక్ష’ ప్రమోషన్లలో భాగంగా స్వయంగా తేజు అప్పటి పరిస్థితుల్ని తలచుకుంటూ ఫ్యాన్స్కి జాగ్రత్తలు చెబుతూనే తాను అనుభవించిన బాధను వివరిస్తుండడం నిజంగా మనసుకు కదిలించి వేస్తోంది.
ఇక ‘విరూపాక్ష’ సినిమా తేజుకి వెరీ వెరీ స్పెషల్ మూవీ. దాదాపు తేజుకిది యాక్సిడెంట్ తర్వాత పునర్జన్మగానే పరిగణించొచ్చు. ఈ తరుణంలో ఆయన నుంచి వస్తున్న ‘విరూపాక్ష’ సినిమాని కొత్త కోణంలో చూడాలంటున్నారు మేకర్లు.
అవును నిజమే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా తెరకెక్కిన సినిమా ఇది. సుకుమార్ అందించిన కథతో కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ఆరోగ్యం సపోర్ట్ చేయకున్నా.. కమిట్మెంట్తో ఏదో చేయాలన్న కసితో తేజు ఈ సినిమా పూర్తి చేశాడు. రిజల్ట్ ఏమొస్తుందో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 21) ‘విరూపాక్ష’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









