మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన TTD
- April 23, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి నకిలీ వెబ్ సైట్ల బెడద పట్టుకుంది. తిరుమలలో మరో నకిలీ వెబ్ సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ ఐటీ విభాగం తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ దీనిపై విచారణ చేస్తోంది. నకిలీ వెబ్ సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. ఇప్పటికే 40 నకిలీ వెబ్ సైట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజాగా కేసులో వెబ్ సైట్ల సంఖ్య 41కి చేరింది. టీటీడీ వెబ్ సైట్ ను పోలిన రీతిలోనే నకిలీ వెబ్ సైట్లను కోకొళ్లలుగా సృష్టించి మోసగాళ్లు భక్తులను సులభంగా మోసం చేస్తున్న వైనాన్ని టీటీడీ గుర్తించింది. ఇటీవలనే 40 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి పోలీసులకు పిర్యాదు చేసింది. తాజాగా ఆదివారం మరో నకిలీ వెబ్ సైట్ ను టీటీడీ గుర్తించింది.
టీటీడీ ఐటీ విభాగం నకిలీ వెబ్ సైట్ ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా భక్తులు పెద్ద ఎత్తున మోసపోతుండటంతో టీటీడీ నకిలీ వెబ్ సైట్లపై దృష్టి సారించింది. ఏదైతే టీటీడీ వెబ్ సైట్ ఉంటుందో అదే తరహాలో స్వల్ప మార్పులతో భక్తులను నమ్మించే విధంగా నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









