‘రిపబ్లిక్’ సీక్వెల్‌కి ‘విరూపాక్ష’ ఊతమిచ్చిందా.?

- April 26, 2023 , by Maagulf
‘రిపబ్లిక్’ సీక్వెల్‌కి ‘విరూపాక్ష’ ఊతమిచ్చిందా.?

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. 

తేజు బైక్ యాక్సిడెంట్‌తో కోమాలో వున్న టైమ్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన వంతుగా ఈ సినిమాని ప్రమోట్ చేసినా సక్సెస్ కాలేదు.

నిజానికి ఇది సినిమా కాదు, వాస్తవ పరిస్థితి. పాలిటిక్స్ ముసుగులో జరుగుతున్న కుట్రలూ, కుతంత్రాలూ, మోసాలను ఎండగట్టేశాడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ దేవ్ కట్టా.

అయితే, ఈ సినిమాలోని వాస్తవ పరిస్థితుల్ని కాదు కదా.. కనీసం సినిమాలా కూడా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ‘విరూపాక్ష’ తో అల్టిమేట్ రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రేక్షకులు కూడా అంతే బాగా తేజుకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు సక్సెస్‌తో. 

సో, ఈ టైమ్‌లో ‘రిపబ్లిక్’ సీక్వెల్ వదిలితే, మంచి బజ్ క్రియేట్ అవుతుందనుకుంటున్నాడట డైరెక్టర్ దేవ్ కట్టా. ఆ పనుల్లోనే ప్రస్తుతం ఆయన బిజీ అయిపోయారట. అన్నట్లు ‘రిపబ్లిక్’ సీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్‌నీ దేవ్ కట్టా ఎంగేజ్ చేస్తున్నట్లు సమాచారం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com