‘రిపబ్లిక్’ సీక్వెల్కి ‘విరూపాక్ష’ ఊతమిచ్చిందా.?
- April 26, 2023సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
తేజు బైక్ యాక్సిడెంట్తో కోమాలో వున్న టైమ్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన వంతుగా ఈ సినిమాని ప్రమోట్ చేసినా సక్సెస్ కాలేదు.
నిజానికి ఇది సినిమా కాదు, వాస్తవ పరిస్థితి. పాలిటిక్స్ ముసుగులో జరుగుతున్న కుట్రలూ, కుతంత్రాలూ, మోసాలను ఎండగట్టేశాడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ దేవ్ కట్టా.
అయితే, ఈ సినిమాలోని వాస్తవ పరిస్థితుల్ని కాదు కదా.. కనీసం సినిమాలా కూడా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ‘విరూపాక్ష’ తో అల్టిమేట్ రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రేక్షకులు కూడా అంతే బాగా తేజుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సక్సెస్తో.
సో, ఈ టైమ్లో ‘రిపబ్లిక్’ సీక్వెల్ వదిలితే, మంచి బజ్ క్రియేట్ అవుతుందనుకుంటున్నాడట డైరెక్టర్ దేవ్ కట్టా. ఆ పనుల్లోనే ప్రస్తుతం ఆయన బిజీ అయిపోయారట. అన్నట్లు ‘రిపబ్లిక్’ సీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్నీ దేవ్ కట్టా ఎంగేజ్ చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ