‘రిపబ్లిక్’ సీక్వెల్కి ‘విరూపాక్ష’ ఊతమిచ్చిందా.?
- April 26, 2023
సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
తేజు బైక్ యాక్సిడెంట్తో కోమాలో వున్న టైమ్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన వంతుగా ఈ సినిమాని ప్రమోట్ చేసినా సక్సెస్ కాలేదు.
నిజానికి ఇది సినిమా కాదు, వాస్తవ పరిస్థితి. పాలిటిక్స్ ముసుగులో జరుగుతున్న కుట్రలూ, కుతంత్రాలూ, మోసాలను ఎండగట్టేశాడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ దేవ్ కట్టా.
అయితే, ఈ సినిమాలోని వాస్తవ పరిస్థితుల్ని కాదు కదా.. కనీసం సినిమాలా కూడా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ‘విరూపాక్ష’ తో అల్టిమేట్ రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రేక్షకులు కూడా అంతే బాగా తేజుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సక్సెస్తో.
సో, ఈ టైమ్లో ‘రిపబ్లిక్’ సీక్వెల్ వదిలితే, మంచి బజ్ క్రియేట్ అవుతుందనుకుంటున్నాడట డైరెక్టర్ దేవ్ కట్టా. ఆ పనుల్లోనే ప్రస్తుతం ఆయన బిజీ అయిపోయారట. అన్నట్లు ‘రిపబ్లిక్’ సీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్నీ దేవ్ కట్టా ఎంగేజ్ చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









