‘రిపబ్లిక్’ సీక్వెల్కి ‘విరూపాక్ష’ ఊతమిచ్చిందా.?
- April 26, 2023
సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
తేజు బైక్ యాక్సిడెంట్తో కోమాలో వున్న టైమ్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి తన వంతుగా ఈ సినిమాని ప్రమోట్ చేసినా సక్సెస్ కాలేదు.
నిజానికి ఇది సినిమా కాదు, వాస్తవ పరిస్థితి. పాలిటిక్స్ ముసుగులో జరుగుతున్న కుట్రలూ, కుతంత్రాలూ, మోసాలను ఎండగట్టేశాడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ దేవ్ కట్టా.
అయితే, ఈ సినిమాలోని వాస్తవ పరిస్థితుల్ని కాదు కదా.. కనీసం సినిమాలా కూడా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ‘విరూపాక్ష’ తో అల్టిమేట్ రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రేక్షకులు కూడా అంతే బాగా తేజుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సక్సెస్తో.
సో, ఈ టైమ్లో ‘రిపబ్లిక్’ సీక్వెల్ వదిలితే, మంచి బజ్ క్రియేట్ అవుతుందనుకుంటున్నాడట డైరెక్టర్ దేవ్ కట్టా. ఆ పనుల్లోనే ప్రస్తుతం ఆయన బిజీ అయిపోయారట. అన్నట్లు ‘రిపబ్లిక్’ సీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్నీ దేవ్ కట్టా ఎంగేజ్ చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
- SATA జెద్దా–ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!









