ఇండియా-యూఏఈ ట్రావెల్: ఎయిర్ ఇండియా సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
- April 27, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా దుబాయ్ కి మరిన్ని నాన్స్టాప్ ఫ్లైట్లను ప్రకటించింది. ఇవి ఢిల్లీ, ముంబై నుంచి నేరుగా నడువనున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లు ప్రస్తుత వేసవి షెడ్యూల్లో భాగంగా ఈ రెండు నగరాల నుంచి రోజువారీ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి ఢిల్లీ, దుబాయ్ మధ్య విమానాలు (రెండు దిశలలో) డైలీ 10 సర్వీసులు.. ముంబై, దుబాయ్ మధ్య ఇప్పుడు రోజువారీగా నడుస్తున్న విమాన సర్వీసుల సంఖ్య 6కు పెరగనున్నాయి. ఎయిర్ ఇండియా సమ్మర్ ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం.. ఇకపై ఇండియా నుంచి దుబాయ్ కి విమాన సర్వీసులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అందుబాటులో ఉంటాయి. దుబాయ్ రూట్ లో బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ను (బిజినెస్ క్లాస్లో 18 ఫ్లాట్ బెడ్లు, 238 ఎకానమీ క్లాస్ సీట్లు కలిగి ఉంటుంది) రోజువారీ విమాన సర్వీసుల్లో అత్యధిక భాగం కల్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్లలో ప్రయాణికులు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

తాజా వార్తలు
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!









