దక్షిణ అల్ షర్కియాలో వాడి ప్రవాహంలో ముగ్గురు గల్లంతు
- April 27, 2023
మస్కట్: అల్ షర్కియా దక్షిణ ప్రాంతంలో వాడి ప్రవాహం నుంచి ఆరుగురిని అధికారులు రక్షించారు. కాగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. వీరి కోసం అన్వేషణ కొనసాగుతోందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) ప్రకటించింది. జలాన్ బనీ బు అలీలోని వాడి అల్-బాతా ప్రవాహంలో 9 మంది వ్యక్తులతో 3 వాహనాలు మునిగిపోయిన సంఘటన గురించి సీడీఏఏ బృందాలకు సమాచారం అందిందన్నారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన రెస్క్యూ బృందాలు 6 మందిని రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతు అయ్యారని వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









