పదేళ్ల కుమార్తెను బాత్టబ్లో ముంచి చంపిన తల్లికి జీవితఖైదు
- April 27, 2023
దుబాయ్: తూర్పు యూరప్కు చెందిన 38 ఏళ్ల తల్లి తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసి చంపినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు ఫైల్ ప్రకారం.. తన కుమార్తె బాత్టబ్లో మునిగిపోయిందని చెప్పి తల్లి అంబులెన్స్ను పిలిచింది. పోలీసులు వెళ్లి విచారించగా.. పదేళ్ల చిన్నారి శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలితో పాటు ఇంట్లో ఉంటున్న తల్లిని, రెండేళ్ల వయసున్న మరో చిన్నారిని పోలీసులు విచారించారు. ఆ ఇంట్లో పని చేసే ఓ సర్వెంట్ తన కూతురిని బాత్టబ్లో ముంచి దేశం విడిచి పారిపోయాడని తల్లి ఆరోపించింది. కానీ, నేరం జరిగిన రోజున ఆ సర్వెంట్ దేశం విడిచి వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. ఇంటర్పోల్ ఆ సర్వెంట్ ను అతని స్వదేశంలోని విమానాశ్రయంలోని అరైవల్ హాల్లో పట్టుకుంది. అతన్ని విచారించగా, అతను నేరంలో పాల్గొనలేదని తెలిపాడు. తాను కొన్ని నెలల క్రితం ఎమిరేట్కి వచ్చానని, ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఇద్దరు పిల్లలను స్కూల్కి తీసుకెళ్లడం, తీసుకురావడం తన పని అని పోలీసులకు చెప్పాడు. బాలికను తల్లి తరచూ చిత్రహింసలకు గురిచేయడం, శారీరకంగా, మానసికంగా వేధించడం గమనించానని చెప్పాడు. నేరం జరగడానికి ముందు రోజు తల్లి తన కుమార్తెను తన గదిలోకి లాక్కెళ్లడం చూశానని సర్వెంట్ అధికారులకు తెలిపాడు. నేరం జరిగిన రోజు ఉదయం బాలికను పాఠశాలకు నిద్ర లేపేందుకు వెళ్లి చూడగా ఆమె బెడ్రూంలో కనిపించలేదని, బాత్రూమ్లో నుంచి చిన్నపాటి నీళ్ల శబ్దం రావడంతో తలుపులు తెరిచి చూడగా బాలిక బాత్టబ్లో పడి ఉందని, ఆమె తల్లి వద్దకు వెళ్లి కూతురు చనిపోయిందని తెలిపినట్లు పేర్కొన్నాడు. అయితే, తను వార్త చెప్పగానే తల్లి ప్రశాంతంగా స్పందించడంతో షాక్ అయినట్లు, నేరం తనపై పడుతుందనే భయంతో వెంటనే స్వదేశానికి పారిపోయాయని వివరించాడు. సర్వెంట్ వాంగ్మూలం ఆధారంగా చేపట్టిన విచారణలో తల్లి నేరాన్ని అంగీకరించింది. తన కుమార్తెపై దాడి చేసి బాత్టబ్లో ముంచివేసినట్లు ఆమె అంగీకరించింది. కాగా, జరిగిన నేరాన్ని పోలీసులకు తెలపనందుకు సర్వెంట్ కి దుబాయ్లోని మిస్డిమినర్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, తరువాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026
- IPL 2026: ఫైనల్లో గుజరాత్ 155 రన్స్..ఆర్సీబీ కొట్టాల్సింది 156
- వైజాగ్లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు









