ఇరాన్ నిర్బంధంలో 24 మంది భారతీయ సిబ్బంది..!
- April 29, 2023
గల్ఫ్: ఒమన్ తీరంలో ఇరాన్ స్వాధీనం చేసుకున్న యుఎస్-బౌండ్ ఆయిల్ ట్యాంకర్లో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిని విడుదల చేయడానికి కృషి చేస్తున్నామని నౌక ఆపరేటర్ శుక్రవారం వెల్లడించారు. మార్షల్ ఐలాండ్స్ ఫ్లాగ్ చేసిన అడ్వాంటేజ్ స్వీట్ను(నౌక) ఇరాన్ నావికాదళం "అంతర్జాతీయ వివాదం" కారణంగా గుర్తుతెలియని ఓడరేవుకు తీసుకువెళ్లినట్లు ఆపరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇరాన్ అధికారులు నిర్బంధించిన ఓడ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం లేదని, సంబంధిత అధికారులందరితో చర్చలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, తన ఓడలో ఒకదానితో అడ్వాంటేజ్ స్వీట్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో ఇద్దరు ఇరాన్ సిబ్బంది తప్పిపోయారని మరియు అనేకమంది గాయపడ్డారని ఇరాన్ ఆరోపిస్తుంది. మరోవైపు గల్ఫ్ జలాల్లో ఇరాన్ పెత్తనాన్ని అమెరికా ఆక్షేపించింది. స్వాధీనం చేసుకున్న నౌకను తక్షణమే విడుదల చేయాలని అమెరికా నావికాదళం డిమాండ్ చేసింది. ఓడ కువైట్ నుండి చమురును లోడ్ చేసుకొని వస్తుండగా ఈ ఘటన జరిగిందని అడ్వాంటేజ్ ట్యాంకర్స్ ప్రతినిధి తెలిపారు. ప్రపంచంలోని సముద్రపు చమురులో మూడింట ఒక వంతును మోసుకెళ్లే గల్ఫ్లోని సున్నితమైన జలాల్లో గురువారం నాటి నిర్బంధం ఘటన ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని స్తంభింపజేసిన బహుళజాతి ఒప్పందం నుండి అమెరికా వైదొలిగిన 2018 నుండి ఇటువంటి సంఘటనలు జరగడం పెరగడం గమనార్హం.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









