యూఏఈ-భారత ఆర్థిక సంబంధాలలో కొత్త చైతన్యం
- April 30, 2023
యూఏఈ: గత ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన యూఏఈ -ఇండియా సెపా భాగస్వామ్యంలో కొత్త చైతన్యాన్ని నింపిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి సంబంధించినది కాదని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక పురోగతికి చేయూతనిస్తుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ప్రకారం వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు పుంజుకుంటున్నందున పెట్టుబడులు, సేవలు, మానవ వనరులు, స్టార్టప్లపై దృష్టి మళ్లిందని ఆయన చెప్పారు. ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులు త్వరలో 31 బిలియన్ డాలర్లు దాటుతాయని అంచనా. రత్నాలు, ఆభరణాలు, శుద్ధి చేసిన ఖనిజాలు, ఆహారం, వ్యవసాయం, FMCG రంగం ఎగుమతుల వైపు నుండి అత్యధికంగా లాభపడిన రంగాలుగా ఉన్నాయని తెలిపారు.
యూఏఈ ఆహార భద్రతకు భారత్ అండగా ఉంటుందన్నారు. అదే సమయంలో ఆహార భద్రత విషయంలో యూఏఈ భారతదేశంలో $2 బిలియన్ల పెట్టుబడితో ఫుడ్ పార్కుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు దేశాల మధ్య విమానయాన రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయి. యూఏఈలో పరిమిత సంఖ్యలో ఎయిర్ పోర్టులు ఉండగా.. భారత్ లో పరిస్థి భిన్నంగా ఉంది. రాబోయే రోజుల్లో యూఏఈ-భారత్ మార్గతంలో మరిన్ని సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









