అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పాక్షికంగా మూసివేత
- April 30, 2023
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనను మే 13 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. అయితే, మూసివేతకు గల కారణాన్ని అధికార యంత్రాంగం పేర్కొనలేదు. అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు వారానికి ఆరు రోజులు వంతెన మూసివేయబడుతుందని.. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఆర్టీఏ కోరింది. ఇటీవల ప్రధాన నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 17 నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జిని రెండు వైపులా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీఏ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు: అల్ గర్హౌద్ వంతెన, బిజినెస్ బే బ్రిడ్జ్, అల్ షిందఘ టన్నెల్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







