అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పాక్షికంగా మూసివేత
- April 30, 2023
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనను మే 13 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. అయితే, మూసివేతకు గల కారణాన్ని అధికార యంత్రాంగం పేర్కొనలేదు. అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు వారానికి ఆరు రోజులు వంతెన మూసివేయబడుతుందని.. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఆర్టీఏ కోరింది. ఇటీవల ప్రధాన నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 17 నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జిని రెండు వైపులా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీఏ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు: అల్ గర్హౌద్ వంతెన, బిజినెస్ బే బ్రిడ్జ్, అల్ షిందఘ టన్నెల్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









