‘విమానం’ ఎక్కిన రంగమ్మత్త.! ల్యాండింగ్ ఎప్పుడంటే.!
- May 01, 2023
హాటెస్ట్ యాంకర్గా బుల్లితెరపై పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం సినిమాల్లో తెగ బిజీ అయిపోయింది.
సుకుమార్ పుణ్యమా అని ‘రంగస్థలం’లో రంగమ్మత్త అవతారం ఎప్పుడయితే ఎత్తిందో.. అప్పటి నుంచీ అనసూయ భరద్వాజ్ దశ తిరిగిపోయింది. మూడు ఐటెం సాంగులూ, ఆరు స్పెషల్ రోల్స్.. అంటూ కెరీర్లో బిజీ అయిపోయింది.
బుల్లితెర కోసం టైమ్ కేటాయించలేనంత బిజీ అయిపోయింది అనసూయ భరద్వాజ్. ‘పుష్ప 2’లో దాక్షాయణి పాత్ర పోషిస్తోంది. అనసూయ చేతిలో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ప్రస్తుతం చాలానే వున్నాయ్.
తాజాగా అనసూయ భరద్వాజ్ నటిస్తున్న ‘విమానం’ అనే సినిమా నుంచి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓ స్టిల్ రిలీజ్ చేశారు.

‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్రను తలపించేలా వుంది ఈ స్టిల్లో అనసూయ గెటప్పూ, సెటప్పూ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. జూన్ 9న ‘విమానం’ ధియేటర్లలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









