‘విమానం’ ఎక్కిన రంగమ్మత్త.! ల్యాండింగ్ ఎప్పుడంటే.!
- May 01, 2023
హాటెస్ట్ యాంకర్గా బుల్లితెరపై పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం సినిమాల్లో తెగ బిజీ అయిపోయింది.
సుకుమార్ పుణ్యమా అని ‘రంగస్థలం’లో రంగమ్మత్త అవతారం ఎప్పుడయితే ఎత్తిందో.. అప్పటి నుంచీ అనసూయ భరద్వాజ్ దశ తిరిగిపోయింది. మూడు ఐటెం సాంగులూ, ఆరు స్పెషల్ రోల్స్.. అంటూ కెరీర్లో బిజీ అయిపోయింది.
బుల్లితెర కోసం టైమ్ కేటాయించలేనంత బిజీ అయిపోయింది అనసూయ భరద్వాజ్. ‘పుష్ప 2’లో దాక్షాయణి పాత్ర పోషిస్తోంది. అనసూయ చేతిలో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ప్రస్తుతం చాలానే వున్నాయ్.
తాజాగా అనసూయ భరద్వాజ్ నటిస్తున్న ‘విమానం’ అనే సినిమా నుంచి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓ స్టిల్ రిలీజ్ చేశారు.

‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్రను తలపించేలా వుంది ఈ స్టిల్లో అనసూయ గెటప్పూ, సెటప్పూ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. జూన్ 9న ‘విమానం’ ధియేటర్లలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..







