‘విమానం’ ఎక్కిన రంగమ్మత్త.! ల్యాండింగ్ ఎప్పుడంటే.!
- May 01, 2023
హాటెస్ట్ యాంకర్గా బుల్లితెరపై పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం సినిమాల్లో తెగ బిజీ అయిపోయింది.
సుకుమార్ పుణ్యమా అని ‘రంగస్థలం’లో రంగమ్మత్త అవతారం ఎప్పుడయితే ఎత్తిందో.. అప్పటి నుంచీ అనసూయ భరద్వాజ్ దశ తిరిగిపోయింది. మూడు ఐటెం సాంగులూ, ఆరు స్పెషల్ రోల్స్.. అంటూ కెరీర్లో బిజీ అయిపోయింది.
బుల్లితెర కోసం టైమ్ కేటాయించలేనంత బిజీ అయిపోయింది అనసూయ భరద్వాజ్. ‘పుష్ప 2’లో దాక్షాయణి పాత్ర పోషిస్తోంది. అనసూయ చేతిలో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ప్రస్తుతం చాలానే వున్నాయ్.
తాజాగా అనసూయ భరద్వాజ్ నటిస్తున్న ‘విమానం’ అనే సినిమా నుంచి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓ స్టిల్ రిలీజ్ చేశారు.

‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్రను తలపించేలా వుంది ఈ స్టిల్లో అనసూయ గెటప్పూ, సెటప్పూ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. జూన్ 9న ‘విమానం’ ధియేటర్లలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







