ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్

- May 04, 2023 , by Maagulf
ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్

న్యూ ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయణమయ్యారు. మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు.

అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు ఢిల్లీకి బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com