కోహినూర్ కంటే అతి పెద్ద వజ్రం దుబాయ్లో!
- May 10, 2016
ఇండియా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో కోహినూర్ డిమాండ్ వివాదం ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునే అంశమైంది. బ్రిటన్ రాజమాత కిరీటంలో ప్రస్తుతం పొదగబడి ఉన్న ఈ వజ్రం, వాస్తవానికి భారతదేశంలో లభించింది. అలా అలా బ్రిటన్కి చేరిన ఈ వజ్రం గురించి వివాదాలు నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అతి గొప్ప వజ్రం ఏదంటే అది ఖచ్చితంగా కోహినూర్ మాత్రమే. అయితే దీన్ని తలదన్నే వజ్రాన్ని దుబాయ్లో తయారు చేయనున్నారట. అంగోలాలో లభ్యమైన రఫ్ డైమండ్ బరువు 404 క్యారెట్లు. దీన్ని గ్రిసోగోనో సంస్థ పాలిష్ చేయనుంది. అత్యంత అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వేస్టేజ్ తక్కువగా ఉండేలా ఈ వజ్రానికి మెరుగులు దిద్దుతారు. కోహినూర్ వజ్రం రఫ్ స్టేజ్లో 793 క్యారెట్లు. అనేకసార్లు దాన్ని పాలిష్ చేయగా, 105.6 క్యారెట్ల వజ్రంగా రూపొందింది. కోహినూర్ కన్నా పెద్దగా తాము కనుగొన్న వజ్రాన్ని రూపొందిస్తామని గ్రిసోగోనో సంస్థ వెల్లడించింది. దుబాయ్ వజ్రాల వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిందనీ, దుబాయ్లో తాము వజ్రాల వ్యాపారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







