రియల్ ఎస్టేట్ మోసాలపై ఉక్కుపాదం
- May 10, 2016
వినియోగదారుల్ని 'కోల్డ్ కాల్స్'తో మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేదా ఆ ముసుగులో మోసాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించనున్నామని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (రెరా) స్పష్టం చేశాయి. రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ 'రెరా' డైరెక్టర్ జనరల్ అలీ అబ్దుల్లా అలి మాట్లాడుతూ, మోసాలకు పాల్పడే ఏజెన్సీలకు 50,000 దిర్హామ్ల ఫైన్ విధిస్తామని, ఇండివిడ్యువల్ ఏజెంట్స్పై నెలపాటు సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా ప్రజలు వెంటనే అధికారుల్ని సంప్రదించాలనీ, ఫిర్యాదులు నమోదు చేయాలని ఆయన సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏజెంట్లు, సంస్థలు వ్యవహరించిన పక్షంలో వారిపై ఇంకా కఠిన చర్యలకు వెనుకాడబోమని అల్ అలి చెప్పారు. బ్రోకరేజ్ సంస్థలు, తమ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రచారాలకు అనుమతి తీసుకోవాలనీ, ఇందులో తమ వినియోగదారుల వివరాల్నీ పేర్కొనాలని, అర్హత లేనివారి ద్వారా ఫోన్లు చేయించడం, వాట్సాప్ ద్వారా ప్రచారాలు చేయడం నిషిద్ధమని ఆయన వివరించారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







