యూఏఈతో సహా 7 గమ్యస్థానాలకు 48 గంటల ఫ్లాష్ సేల్.. విమాన టిక్కెట్లపై 60% తగ్గింపు
- May 06, 2023
యూఏఈ: సౌదీయా ఎయిర్లైన్స్ నిర్దిష్ట గమ్యస్థానాలకు టిక్కెట్లపై ఫ్లాష్ సేల్ను ప్రకటించింది. ఇందులో భాగంగా విమాన టెక్కెట్లపై 60 శాతం వరకు తగ్గింపునిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌదీయా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. తగ్గింపు ధరలపై కొన్ని గమ్యస్థానాలకు టిక్కెట్లను విక్రయిస్తామని అందులో ఎయిర్లైన్ తెలిపింది. ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఎయిర్లైన్ అబుధాబి, కువైట్, దోహా, మస్కట్, మాడ్రిడ్, మారిషస్, గ్వాంగ్జౌ, మాల్దీవులకు టిక్కెట్లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. ఇది మే 10 నుండి జూన్ 15 వరకు ప్రయాణ కాలానికి ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఇటీవల యూఏఈ అతి తక్కువ-ధర విమానయాన సంస్థ విజ్ ఎయిర్ అబుధాబి భారతదేశానికి విమానాలను ప్రారంభించేందుకు నియంత్రణ విధానాలను అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు









