ఇరాక్లో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి
- May 10, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. బఖూబా నగరంలో రద్దీగా ఉండే కమర్షియల్ ప్రాంతంలో బాంబు పేలడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నగరంలో షియాలు ఎక్కువగా ఉండే బేకరీ, రెస్టారెంట్ సమీపంలోకి మినీబస్లో పేలుడు పదార్థాలు నింపుకొని వచ్చి పేల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడిపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. 13 మంది మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







