అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు
- May 08, 2023
పంజాబ్: పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ కు వెళ్లే మార్గంలోని సారాగర్హి సరాయ్ సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సహా డాగ్ స్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలికి స్వల్పంగా గాయమయింది. ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉందని అమృత్ సర్ అసిస్టెంట్ డీసీపీ మెహ్తాబ్ సింగ్ తెలిపారు. ఇదే ప్రాంతంలో నిన్న కూడా బాంబు పేలుడు సంభవించింది. నిన్నటి ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!