ప్రీ-పాండమిక్ స్థాయికి చేరుకున్న భారతీయ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు..!

- May 09, 2023 , by Maagulf
ప్రీ-పాండమిక్ స్థాయికి చేరుకున్న భారతీయ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు..!

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని భారతీయ పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా తగ్గిన అడ్మిషన్లు.. 2023-2024 సెషన్ నాటికి సాధారణ స్థితికి చేరుకున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, పెద్ద సంఖ్యలో ప్రవాసులు దేశానికి తిరిగి రావడంతో ఒమన్‌లోని భారతీయ పాఠశాలల్లో అడ్మిషన్లు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకున్నాయని ఒమన్‌లోని భారతీయ పాఠశాలల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం తెలిపారు. ఈ సంవత్సరం, ఇండియన్ స్కూల్ బోర్డ్‌కు మొత్తం 4,677 దరఖాస్తులు వచ్చాయని, 2021లో 2,530కి పెరిగిందన్నారు. 2020లో, రాజధాని ప్రాంతంలోని భారతీయ పాఠశాలలకు కొత్త దరఖాస్తుదారుల సంఖ్య 3,744 మాత్రమేనన్నారు. భారతీయ పాఠశాలలు 2018లో 4,400 దరఖాస్తులను స్వీకరించాయని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 4,677 మంది పిల్లలకు సీట్లు కేటాయించబడ్డాయన్నారు. 

OMR 150 జీతం ఉన్న వ్యక్తులతో కుటుంబాలు ఉండేందుకు ఒమన్ ప్రభుత్వం నిబంధనలను సడలించడం కూడా ప్రజలు తమ పిల్లలను తీసుకురావడానికి సహాయపడిందని, కోవిడ్ అనంతర కాలం కూడా చాలా మంది ప్రవాసులు తమ కుటుంబాలతో ఒమన్‌కు తిరిగి రావడానికి దారితీసిందన్నారు. రాజధాని ప్రాంతంలోని భారతీయ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబీర్, ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా అంతర్జాతీయ విభాగంలో అడ్మిషన్ల కోసం, తల్లిదండ్రులు నేరుగా ఈ పాఠశాలలను సంప్రదించవచ్చని సూచించారు. ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో ఉన్న కేర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (CSE)లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రవేశం కోసం తల్లిదండ్రులు నేరుగా CSE పరిపాలన విభాగంను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com