ఒమన్ విమానాశ్రయాలకు 94% పెరిగిన రాకపోకలు
- May 10, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన తాజా డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2023 చివరి నాటికి ఒమన్ విమానాశ్రయాల ద్వారా అంతర్జాతీయ ఇన్బౌండ్ , అవుట్బౌండ్ విమానాల సంఖ్య పెరిగింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం, సోహార్ విమానాశ్రయం ద్వారా ఇన్బౌండ్/అవుట్బౌండ్ అంతర్జాతీయ విమానాల సంఖ్య ఫిబ్రవరి 2023 చివరి నాటికి 112.4% పెరిగి 2022లో 6,708తో పోలిస్తే 14,250కి చేరుకుంది. అంతేకాకుండా, మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం, సోహార్ విమానాశ్రయం ద్వారా దేశీయ ఇన్బౌండ్ / అవుట్బౌండ్ విమానాల సంఖ్య 2022లో ఇదే కాలంలో 1,973తో పోలిస్తే 1.1% పెరిగి 1,994కి చేరుకుంది.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం, మస్కట్ విమానాశ్రయం, దుక్మ్ విమానాశ్రయం ద్వారా వచ్చే ఇన్బౌండ్, అవుట్బౌండ్ , ట్రాన్సిట్ ప్రయాణీకుల సంఖ్య ఫిబ్రవరి 2023 చివరి నాటికి 2,231,451కి చేరుకోవడంతో ఒమన్ విమానాశ్రయాల ద్వారా వచ్చే వారి సంఖ్య 94% పెరిగింది. అదే నెలాఖరు వరకు విమానాశ్రయాల ద్వారా బయటికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య 2022లో ఇదే కాలంతో పోలిస్తే 113% పెరిగింది.
జాతీయత వారీగా.. ఫిబ్రవరి 2023 చివరి నాటికి 123,130 మంది ప్రయాణికులతో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రయాణికులు 44,233, 37,130 మంది పాకిస్తానీ ప్రయాణీకులు ఉన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







