చేపల పొరుటు
- May 10, 2016
కావలసిన పదార్థాలు: (ముళ్లు తక్కువుండి, తల, తోక తీసేసిన) చేప ముక్కలు - 800 గ్రా., ఉల్లి తరుగు - అరకప్పు, వెల్లుల్లి రేకలు - 8, పచ్చిమిర్చి - 6, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2
టేబుల్ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: చేప ముక్కల్ని ఆవిరిపై ఉడికించి చల్లారిన తర్వాత ముళ్లు తీసేసి, చేత్తో పొడిపొడిగా చేసి పక్కనుంచాలి. నూనెలో ఆవాలు, మినప్పప్పు, (సన్నగా పొడుగ్గా తరిగిన) వెల్లుల్లి రేకలు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించి ఉప్పు, పసుపు, కరివేపాకు కూడా వేసి చివర్లో చేప పొడి కలిపి చిన్న మంటపై 10 నిమిషాలు ఉంచాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. ఈ పొరుటును రసమన్నంలో నంజుకున్నా, చపాతీలతో తిన్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









