ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- May 11, 2023ఆస్తమా రోగుల్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. నాలుగు అడుగులు వేసినా ఆయాసం వస్తుంది. గుండె దడగా వుంటుంది. భయం, ఆందోళన తదితర లక్షణాలు ఆస్తమా రోగుల్లో చూస్తుంటాం.
జలుబు, దగ్గు, వైరస్లే ఆస్తమాకి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటాం. పదిమంది ఆస్తమా రోగుల్లో ఆరుగురికి చల్లటి గాలి కారణంగా ఆస్తమా వచ్చే ప్రమాదముంటుంది. నలుగురికి, కాలుష్యం, పూల పుప్పొడి ఇతరత్రా కారణాలు కావచ్చు.
ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? మసాలాలూ, శీతల పానీయాలు, చాక్లెట్లు తినకూడదు. దుమ్ము, ధూళి, ఘాటు వాసనలకు కాస్త దూరంగా వుండాలి. చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం నిషిద్ధం. గోరువెచ్చని తాగునీటినే ఉపయోగిస్తే మంచిది. పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం చేయకూడదు.
ఆస్తమాని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకప్పుడు ఆధునిక వైద్యంలో ఆస్తమాకి చికిత్స వుండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఆదునిక వైద్యం అందుబాటులో వుంది. ఆస్తమాపై గతంతో పోల్చితే, ఇప్పుడు మంచి అవగాహన కూడా వుంది.
కానీ, ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..