ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- May 11, 2023
ఆస్తమా రోగుల్లో శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. నాలుగు అడుగులు వేసినా ఆయాసం వస్తుంది. గుండె దడగా వుంటుంది. భయం, ఆందోళన తదితర లక్షణాలు ఆస్తమా రోగుల్లో చూస్తుంటాం.
జలుబు, దగ్గు, వైరస్లే ఆస్తమాకి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటాం. పదిమంది ఆస్తమా రోగుల్లో ఆరుగురికి చల్లటి గాలి కారణంగా ఆస్తమా వచ్చే ప్రమాదముంటుంది. నలుగురికి, కాలుష్యం, పూల పుప్పొడి ఇతరత్రా కారణాలు కావచ్చు.
ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? మసాలాలూ, శీతల పానీయాలు, చాక్లెట్లు తినకూడదు. దుమ్ము, ధూళి, ఘాటు వాసనలకు కాస్త దూరంగా వుండాలి. చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం నిషిద్ధం. గోరువెచ్చని తాగునీటినే ఉపయోగిస్తే మంచిది. పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం చేయకూడదు.
ఆస్తమాని ప్రాధమిక దశలోనే గుర్తిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకప్పుడు ఆధునిక వైద్యంలో ఆస్తమాకి చికిత్స వుండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఆదునిక వైద్యం అందుబాటులో వుంది. ఆస్తమాపై గతంతో పోల్చితే, ఇప్పుడు మంచి అవగాహన కూడా వుంది.
కానీ, ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







