యూఏఈలో దారుణం.. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష
- May 11, 2023
యూఏఈ: యూఏఈలో ఒక బాలుడిపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడినందుకు ఒక వ్యక్తికి 20 సంవత్సరాల కంటే ఎక్కువ జైలుశిక్ష, Dh200,000 జరిమానా విధించారు. కల్బా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని జువైనల్ కోర్టుకు రిఫర్ చేసింది. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన క్రిమినల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, బాధితురాలి తల్లికి నిందితుడు బంధువు. తన కుమారుడిపై లైంగికంగా దాడులు చేస్తున్నాడని గుర్తించింది. అతను 11 సంవత్సరాల వయస్సు నుండి అతనిపై "అనేక సార్లు" అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు బాధితుడిపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనపై ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను వాడుతున్నట్లు కూడా తేలిందిని అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తల్లిదండ్రులు, కుటుంబాలు తమ పిల్లల వ్యవహారాలపై శ్రద్ధ వహించాలని, వారితో కమ్యూనికేట్ కావాలని, అన్ని రకాల హాని నుండి వారిని రక్షించడానికి నిరంతరం వారి మాటలు వినాలని సూచించింది.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









