విదేశీయులకు 'బ్లడ్ బ్యాగ్' ఫీజులా?:KSHR
- May 12, 2023
కువైట్: ప్రవాసులు, నివాసితులు, సందర్శకులు 'బ్లడ్ బ్యాగ్' కోసం రుసుము చెల్లించాలని ఇటీవల కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం.. కువైట్లోని ప్రవాసులకు ఒక్కో రక్తపు బ్యాగ్కు KD 20, విజిట్ వీసాలో ఉన్న విదేశీయులకు KD 40 వసూలు చేస్తారు. అయితే కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (KSHR) ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని విషయాలను విస్మరించిందని తెలిపింది. ఆరోగ్య హక్కులతో సహా మానవ హక్కులకు సంబంధించి కువైట్ పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యతలు, అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణను అనుసరించడం, వివక్షత లేని విధానం ద్వారా ఆరోగ్య సంరక్షణ హక్కును అమలు చేయాలని కోరింది. ఈ నిర్ణయం వారి ప్రాణాలను రక్షించడానికి రక్తమార్పిడి అవసరమయ్యే కేసులను లక్ష్యంగా పెట్టుకుందని, ముఖ్యంగా ప్రసవ సమయంలో మహిళలను కాపాడుతుందని, అందువల్ల ఇది మహిళలపై అన్ని రకాల వివక్షతలను తొలగించడంపై కన్వెన్షన్ ఆర్టికల్ 12 లో పేర్కొన్న దానిని ఉల్లంఘిస్తుందని పేర్కొంది.
కువైట్ ఆర్టికల్ 12 పేరా 1ని కూడా ఉల్లంఘించిందని KSHR తెలిపింది ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుందని తెలిపింది.కువైట్ కూడా 1996లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికకు అంగీకరించిందన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







