జీవో నంబరు 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
- May 12, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవో నంబరు 1 (GO No.1)ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ ఏడాది జనవరి 2న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
దీన్ని సవాలు చేస్తూ అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ తీర్పు వెలువరించింది. GO No.1తో ప్రాథమిక హక్కులకు విఘాతమని హైకోర్టు తెలిపింది. ఈ జీవో చాలా అన్యాయమంటూ ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.
కాగా, ప్రజల భద్రత దృష్ట్యా రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ జీవో నంబరు 1ని తీసుకొచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. దీని ప్రకారం జాతీయ, రాష్ట్ర, మునిసిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. సభలు, ర్యాలీను ప్రజలకు ఇబ్బందు కలగని ప్రాంతాల్లోనే నిర్వహించుకోవాలని ఏపీ సర్కారు పేర్కొంది. ఒక వేళ ఉల్లంఘిస్తే సభలు, ర్యాలీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







