రేపు బెంగళూరులో కర్ణాటక సీఎల్పీ మీటింగ్!
- May 13, 2023
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్.. పార్టీ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రేపు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశం కానుంది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. తర్వాత తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతి పత్రం అందజేయనున్నారు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 62 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 73 సీట్లలో లీడింగ్ లో ఉంది. అంటే మొత్తం 135 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 కాగా, అంతకంటే 20 పైగా సీట్లను గెలుచుకుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







