బహ్రెయిన్ లో మే 21న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

- May 16, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో మే 21న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

బహ్రెయిన్: మే 21న అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు జీతాలు పంపిణీ చేయాలని ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రిత్వ శాఖను బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశించారు. ఈద్‌ నేపథ్యంలో గత నెల జీతాలను ముందుగానే చెల్లించిన విషయం తెలిసిందే. అదే విధంగా HRH ప్రిన్స్ సల్మాన్ కూడా ఖత్వా హోమ్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్‌లో అర్హత కలిగిన 236 పదవీ విరమణ పింఛను దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలని సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 

గుదైబియా ప్యాలెస్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గృహ ప్రాజెక్టుల కోసం ఖత్వా ప్రోగ్రామ్‌లో 69 ఉద్యోగుల కేసులను సమీక్షించారు. వారు పదవీ విరమణ పెన్షన్ కోసం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని ధృవీకరించడానికి ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. కమిటీ పని పూర్తి చేసేందుకు ఒక నెల గడువు ఇచ్చారు.

బహ్రెయిన్  సమగ్ర అభివృద్ధికి పత్రికా రంగాల కృషిని హైలైట్ చేస్తూ.. జర్నలిజం కోసం ప్రధానమంత్రి అవార్డు ఏడవ ఎడిషన్ విజేతలను కేబినెట్ అభినందించింది. 49వ బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ విజేతలను కూడా కేబినెట్ అభినందించింది.    

మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా రీజియన్‌లోని మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ డైజెస్ట్ ద్వారా 2023కి ఉత్తమ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అవార్డును గెలుచుకున్న న్యూ హౌసింగ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌ను కేబినెట్ స్వాగతించింది. ఈ విషయంలో  బహ్రెయిన్ పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా వినూత్న గృహ సేవలను అనుసరించడం ప్రాముఖ్యతను కేబినెట్ ప్రస్తావించింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. పలు మెమోరాండాలను ఆమోదించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com