యూఏఈలో ఘోర ప్రమాదం..ఇద్దరు ఎమిరాటీలు మృతి
- May 17, 2023
యూఏఈ: మే 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల ఎమిరాటీ పురుషుడు, 44 ఏళ్ల మహిళా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండు వాహనాలు ట్రక్కును ఢీకొనడంతో ఫుజైరా ఓడరేవు వైపు కూడలి (క్రాసింగ్ రోడ్డు)లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫుజైరా పోలీస్ జనరల్ కమాండ్ అధికారులు వెంటనే ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అరబ్ ట్రక్ డ్రైవర్ ఓవర్లోడ్ వాహనం నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రైవర్ అనుమతించదగిన వేగ పరిమితిని మించిపోయాడని, ఇది నియంత్రణ కోల్పోవటానికి దారితీసిందని, తరువాత రెండు కార్లను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు వేగంగా ఆర్పివేశాయి. మంటల్లో చిక్కుకున్న వాహనంలో చిక్కుకున్న ప్రయాణికులను వారు విజయవంతంగా బయటికి తీసుకొచ్చారు. ట్రక్ డ్రైవర్, ఒక వాహనం డ్రైవర్ను జాతీయ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే మొదటి వాహనంలో తండ్రితో పాటు వచ్చిన యువకుడు మరో వాహనంలో ఉన్న మహిళతో పాటు చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతర్గత, బాహ్య రహదారులపై అనుమతించబడిన పరిమితులను మించిన వేగంతో భారీ వాహనాలను నడపడం వల్ల కలిగే ప్రమాదకరమైన పరిణామాల గురించి ఫుజైరా పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









