లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డ ఇద్దరు జెడ్డా జనరల్ కోర్టు ఉద్యోగులు
- May 19, 2023
జెడ్డా: ఓ కేసుకు సంబంధించి పౌరుడి నుండి లంచం అందుకున్న ఇద్దరు ఉద్యోగులను జెడ్డాలోని జనరల్ కోర్టులో అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో 6వ తరగతి ఉద్యోగి అయిన అయిమన్ అబ్దుల్రజాక్ సల్వాతి.. ఒక పౌరుడి నుండి అక్రమంగా అప్పీల్స్ కోర్టులో కేసును ముందుకు తీసుకురావడానికి SR 500,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందులో SR250,000 తీసుకుంటుండగా అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ తెలిపింది. మరో కేసులో పౌరుడికి మరియు జెడ్డాలోని ఒక పెట్టుబడి కంపెనీకి మధ్య ఉన్న కేసులో పౌరుడికి SR 7,317,000 జరిమానా విధించిన తీర్పును రద్దు చేయిస్తానని అదే కోర్టులో 9వ తరగతి ఉద్యోగి అయిన అలీ మహ్మద్ అల్డౌగి SR125,000 లను లంచంగా అందుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఇరువురు ఉద్యోగులు లంచం తీసుకుంటున్న వీడియోలను అథారిటీ విడుదల చేసింది. అవినీతికి వ్యతిరేకంగా తమ జీరో-టాలరెన్స్ విధానాన్ని వర్తింపజేస్తామని అథారిటీ మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







