ఈ సారి మాత్రం ప్యాన్ ఇండియా టార్గెట్ పక్కా.!

- May 19, 2023 , by Maagulf
ఈ సారి మాత్రం ప్యాన్ ఇండియా టార్గెట్ పక్కా.!

‘కార్తికేయ 2’ సినిమాతో అనూహ్యంగా నార్త్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి నార్త్ జనం పట్టం కట్టారు.
అలా నార్త్ ఆడియన్స్‌లో నిఖిల్ బాగా రిజిస్టర్ అయిపోయాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ సినిమాకి ఈ ఇమేజ్‌ని వాడుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు నిఖిల్.
కానీ, ఇప్పుడు నిఖిల్ తాజా సినిమా ‘స్సై’ మాత్రం ప్యాన్ ఇండియాని టార్గెట్ చేస్తోంది. యూనివర్సల్ కంటెంట్ కావడంతో, నార్త్ పైనా ఈ సినిమాకి ఫోకస్ వుందట.
ఆ దిశగానే ప్రమోషన్లు షురూ చేశారు నిఖిల్ అండ్ టీమ్. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన సీక్రెట్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారట. పూర్తిగా ఫిక్షనల్ కాకుండా, కొంత మేర యదార్ధ ఘటనలను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారట. 
అవసరమైన కొన్ని సీన్ల కోసం ఫిక్షన్ వాడినట్లు నిఖిల్ ప్రమోషన్లలో వివరణ ఇచ్చాడు. గ్యారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com