ఈ సారి మాత్రం ప్యాన్ ఇండియా టార్గెట్ పక్కా.!
- May 19, 2023
‘కార్తికేయ 2’ సినిమాతో అనూహ్యంగా నార్త్ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి నార్త్ జనం పట్టం కట్టారు.
అలా నార్త్ ఆడియన్స్లో నిఖిల్ బాగా రిజిస్టర్ అయిపోయాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ సినిమాకి ఈ ఇమేజ్ని వాడుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు నిఖిల్.
కానీ, ఇప్పుడు నిఖిల్ తాజా సినిమా ‘స్సై’ మాత్రం ప్యాన్ ఇండియాని టార్గెట్ చేస్తోంది. యూనివర్సల్ కంటెంట్ కావడంతో, నార్త్ పైనా ఈ సినిమాకి ఫోకస్ వుందట.
ఆ దిశగానే ప్రమోషన్లు షురూ చేశారు నిఖిల్ అండ్ టీమ్. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన సీక్రెట్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారట. పూర్తిగా ఫిక్షనల్ కాకుండా, కొంత మేర యదార్ధ ఘటనలను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారట.
అవసరమైన కొన్ని సీన్ల కోసం ఫిక్షన్ వాడినట్లు నిఖిల్ ప్రమోషన్లలో వివరణ ఇచ్చాడు. గ్యారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించింది.
తాజా వార్తలు
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు







