విజయవాడ నుంచి హజ్యాత్రకు ప్రత్యేక విమానాలు- డిప్యూటీ సిఎం అంజాద్బాషా
- May 24, 2023అమరావతి: జూన్ 7 నుంచి 19 వరకు విజయవాడ నుంచి హజ్యాత్రకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సిఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ ఏడాది గన్నవరం ఎయిర్పోర్టులో ఏర్పాటుచేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,813 మంది యాత్రికులను నేరుగా హజ్యాత్రకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజూ 155 మంది హజ్యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ ఎయిర్లైన్స్ రాష్ట్రం నుంచి యాత్రికులను హజ్కు తీసుకెళ్లి మరలా తిరిగి హజ్నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. గుంటూరు జిల్లా నంబూరు మదరసాలో వసతి కల్పన, ఎసి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు యాత్రికులను చేర్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు