ప్రైమ్ ఎనర్జీ డ్రింక్స్ వినియోగంపై పేరెంట్స్ కు హెచ్చరిక..!
- May 25, 2023
యూఏఈ: పిల్లలు ప్రైమ్ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే ప్రమాదాల గురించి దుబాయ్ పాఠశాల తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. GEMS వరల్డ్ అకాడెమీ ఇటీవల తల్లిదండ్రులకు ఓ సర్క్యులర్ పంపింది. ఈ పానీయాలను తీసుకోవడం వల్ల కలిగే పర్యవసనాలను అందులో వివరించారు. ఈ పానీయాలను తీసుకోవడం వల్ల ఆందోళన పెరగడం, వ్యసనంగా మారి వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని GEMS వరల్డ్ అకాడమీ (GWA)లో PR & కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సహర్ తహేరి తెలిపారు. ఈ పానీయాల అధిక వినియోగం హృదయ స్పందన రేటు, అధిక రక్తపోటు, నిద్ర భంగం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. GEMS వరల్డ్ అకాడమీ ప్రాంగణంలో ప్రైమ్ లేదా ఏదైనా ఇతర ఉత్పత్తులను అమ్మడంపై నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైమ్ ఎనర్జీ డ్రింక్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు తగదని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







