అబుధాబి హిందూ దేవాలయాన్ని సందర్శించిన 30 దేశాల రెసిడెంట్ అంబాసిడర్లు
- May 26, 2023
అబుధాబి: యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు 30 కంటే ఎక్కువ దేశాల రెసిడెంట్ అంబాసిడర్లు, దౌత్య సంఘం సభ్యులు మే 25 మేన అబుధాబిలో BAPS హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినప్పటి నుండి ఆలయ పురోగతిని సంజయ్ సుధీర్ వారికి వివరించారు. భారతదేశం, ఇతర దేశాల మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక మరియు సాంస్కృతిక బంధాలకు ప్రతీకగా BAPS హిందూ దేవాలయ ప్రాజెక్టు అని అభివర్ణించారు.
హిందూ మందిర్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ.. శాంతి, సామరస్యం, సహనం, సహజీవనం విలువలను పెంచేలా ఆలయ నిర్మాణాన్ని అద్వితీయ నిర్మించారని తిపారు. భారతీయ సాంస్కృతిక వ్యవస్థలను తెలియజేసేలా ఆలయం లోపల నిర్మించిన వాస్తు శిల్పాలను చూసి రాయబారులు ఆశ్చర్యపోయారు.
BAPS హిందూ దేవాలయం పునాది రాయిని 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేశారు. ఇది ఫిబ్రవరి 2024 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఆలయానికి 17 ఎకరాల భూమిని యూఏఈ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది. యూఏఈని తమ రెండవ నివాసంగా మార్చుకున్న 3.5 మిలియన్ల భారతీయులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు, భారతదేశం-యుఎఇ మధ్య స్నేహానికి చిహ్నంగా నిలిచిపోయే ఆలయ నిర్మాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..









