ఐపీఎల్ 2023: ముంబై పై గుజరాత్ విజయం..
- May 27, 2023గుజరాత్: కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా హార్దిక్ సేన వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్స్కు దూసుకువెళ్లింది. ఆదివారం(మే 28న) చెన్నై సూపర్ కింగ్స్తో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌలైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో దంచికొట్టగా తిలక్ వర్మ(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. మిగిలిన వారిలో కామెరూన్ గ్రీన్(30) పర్వాలేదనిపించగా, రోహిత్ శర్మ(8), నెహల్ వధేరా(4), టిమ్ డేవిడ్(2), విష్ణు వినోద్(2) విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఐదు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు, జాషువా లిటిల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 233 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్మన్ గిల్ (129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లు) శతకంతో దంచికొట్టాడు. ఈ సీజన్లో గిల్కు ఇది మూడో శతకం కాగా.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం. మిగిలిన వారిలో సాయి సుదర్శన్ (43), హార్దిక్ పాండ్య (28*) దూకుడుగా ఆడారు. ముంబయి బౌలర్లు ఆకాశ్ మధ్వాల్, పీయూశ్ చావ్లా చెరో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ