హజ్ కోసం 22,000 మంది నియామకం
- May 29, 2023
రియాద్: యాత్రికులకు సేవలు అందించేందుకు వీలుగా 22,000 మంది కార్మికులను రిక్రూట్ చేయడంతో సహా హజ్ కోసం సన్నాహాలు పూర్తి చేసినట్లు మక్కా మున్సిపాలిటీ వెల్లడించింది. మునిసిపాలిటీ తన అన్ని మానవ, యాంత్రిక సామర్థ్యాలను సమీకరించిందని, ప్రజా భద్రత మరియు స్కౌట్స్, తాత్కాలిక ఆరోగ్య మానిటర్లు, అలాగే పెద్ద సంఖ్యలో పరికరాలు, యంత్రాలతో సహా సహాయక బృందాల మద్దతుతో మునిసిపల్ సేవలను అత్యున్నత స్థాయిలో యాత్రికులకు సేవలు అందించడానికి మునిసిపాలిటీ సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి ఒసామా జైతునీ తెలిపారు. మున్సిపాలిటీ తన 13 సబ్-మునిసిపాలిటీలు, మూడు అనుబంధ మునిసిపాలిటీలు, అలాగే మక్కాలోని 28 కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని తరలించి విధులు కేటాయించినట్లు జైతునీ తెలిపారు.
కాగా, నైజీరియా నుంచి వచ్చిన హజ్ యాత్రికుల తొలి బృందాన్ని శనివారం జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు స్వాగతం పలికింది. ఇరాన్ నుండి హజ్ యాత్రికులతో మరో విమానం మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయాలు, భూ సరిహద్దులు, ఓడరేవుల వద్ద హజ్ సమయంలో యాత్రికుల కోసం విధివిధానాలను సమర్థవంతంగా నిర్వహించడానికి డైరెక్టరేట్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









