హజ్ కోసం 22,000 మంది నియామకం
- May 29, 2023
రియాద్: యాత్రికులకు సేవలు అందించేందుకు వీలుగా 22,000 మంది కార్మికులను రిక్రూట్ చేయడంతో సహా హజ్ కోసం సన్నాహాలు పూర్తి చేసినట్లు మక్కా మున్సిపాలిటీ వెల్లడించింది. మునిసిపాలిటీ తన అన్ని మానవ, యాంత్రిక సామర్థ్యాలను సమీకరించిందని, ప్రజా భద్రత మరియు స్కౌట్స్, తాత్కాలిక ఆరోగ్య మానిటర్లు, అలాగే పెద్ద సంఖ్యలో పరికరాలు, యంత్రాలతో సహా సహాయక బృందాల మద్దతుతో మునిసిపల్ సేవలను అత్యున్నత స్థాయిలో యాత్రికులకు సేవలు అందించడానికి మునిసిపాలిటీ సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి ఒసామా జైతునీ తెలిపారు. మున్సిపాలిటీ తన 13 సబ్-మునిసిపాలిటీలు, మూడు అనుబంధ మునిసిపాలిటీలు, అలాగే మక్కాలోని 28 కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని తరలించి విధులు కేటాయించినట్లు జైతునీ తెలిపారు.
కాగా, నైజీరియా నుంచి వచ్చిన హజ్ యాత్రికుల తొలి బృందాన్ని శనివారం జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు స్వాగతం పలికింది. ఇరాన్ నుండి హజ్ యాత్రికులతో మరో విమానం మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయాలు, భూ సరిహద్దులు, ఓడరేవుల వద్ద హజ్ సమయంలో యాత్రికుల కోసం విధివిధానాలను సమర్థవంతంగా నిర్వహించడానికి డైరెక్టరేట్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







