వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- May 29, 2023బహ్రెయిన్: ఓ మహిళను నిర్దాక్షిణ్యంగా వ్యభిచార రొంపిలోకి దింపినందుకు ఇద్దరు మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు అప్పీళ్ల కోర్టు సమర్థించింది. కోర్టు నేరస్తులకు BD2000 జరిమానా కూడా విధించింది. కోర్టు పత్రాల ప్రకారం.. ఇద్దరు మహిళలు బలవంతం, బెదిరింపులు, ఒత్తిడిని ఉపయోగించి బాధితురాలిని వ్యభిచారం వృత్తిలోకి దింపారు. ఆరు రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. ఆ మహిళ సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధిత మహిళను రక్షించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులలో ఒకరు ఆమె బంధువు. మసాజ్ సేవలు అందించి డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి ఆమెను బహ్రెయిన్ తీసుకొచ్చారు. “నేను బహ్రెయిన్కు రాగానే, వాళ్లు ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికి ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు వారు నన్ను వ్యభిచారం చేయాలని డిమాండ్ చేస్తూ బెదిరించడం ప్రారంభించారు. కానీ నేను నిరాకరించాను. అప్పుడు వారు నా వీసా, ప్రయాణ ఖర్చుల కింద వెంటనే BD1,800 చెల్లించాలని డిమాండ్ చేశారు. నిస్సహాయంగా వాళ్ల ఒత్తిడి తలొగ్గాను. నా పరిస్థితిని రాయబార కార్యాలయానికి, పోలీసులకు తెలియజేయడానికి నాకు అవకాశం లభించే వరకు ఇది కొనసాగింది. ”అని బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!