ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- May 29, 2023
ఢిల్లీ: మే 26న టోక్యో నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో కార్డియాక్ అరెస్ట్కు గురైన సహ ప్రయాణికుడిని కార్డియోవాస్కులర్ సర్జన్ రక్షించారు. 57 ఏళ్ల మధుమేహ వ్యాధిగ్రస్తునికి గుండెపోటు వచ్చినప్పుడు, చండీగఢ్ కు చెందిన సీనియర్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ దీపక్ పూరి వైద్య సేవలు అందించారు. కార్డియాలజిస్ట్ సలహాను అనుసరించి, విమానాన్ని సమీప విమానాశ్రయం కోల్కతాకు మళ్లించారు. అక్కడ రోగిని ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం, సిబ్బంది ఐదు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించి రోగిని కాపాడారు. విమానం గమ్యస్థానానికి చేరుకునే వరకు అతను అతడిని జాగ్రత్తగా చూసుకున్నారు.
భారతీయ మీడియాతో డాక్టర్ పూరి మాట్లాడుతూ.. గుండెపోటు కార్డియాక్ అరెస్ట్కు దారితీసిందని, రోగి కొంతకాలంగా పల్స్, గుండె చప్పుడు, మెదడు ప్రతిస్పందన లేకుండా వైద్యపరంగా మరణించాడని చెప్పారు. అటువంటి పరిస్థితులలో కార్డియాక్ సహాయం ప్రారంభించకపోతే.. మూడు నుండి ఐదు నిమిషాల్లో మెదడు శాశ్వతంగా డెడ్ అవుతుందన్నారు. ప్రస్తుతం రోగి క్షేమంగా ఉన్నారని, మెదడు, కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. డాక్టర్ పూరీ రెండు రోజుల కార్డియోమెర్షన్ వరల్డ్ హార్ట్ కాంగ్రెస్కు హాజరైన తర్వాత టోక్యో నుండి తిరిగి వస్తున్నారు. ప్రయాణికుడికి గుండె ఆగిపోవడంతో డాక్టర్ పూరీ వెంటనే సహాయం కోసం వెళ్లారు. ఫ్లైట్ సిబ్బంది సహాయంతో డాక్టర్ కార్డియాక్ మసాజ్ (CPR) చేసిన తర్వాత, రోగి తేరుకున్నాడు.
కాగా, సంఘటన జరిగినప్పుడు విమానం సముద్రం పైన ఉంది. అక్కడినుంచి ఐదు గంటల దూరంలో కోల్కతా విమానాశ్రయం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు విమానయాన సంస్థ ప్రత్యేకంగా అనుమతిని ఇచ్చింది. ల్యాండింగ్ అయిన వెంటనే, అంబులెన్స్ రోగిని సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ అతని 100% బ్లాక్ అయిన ఎడమ ధమనికి వెంటనే స్టెంట్ వేయడంతో అతను బతికాడని డాక్టర్ పూరీ తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







