ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- May 29, 2023
ఢిల్లీ: మే 26న టోక్యో నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో కార్డియాక్ అరెస్ట్కు గురైన సహ ప్రయాణికుడిని కార్డియోవాస్కులర్ సర్జన్ రక్షించారు. 57 ఏళ్ల మధుమేహ వ్యాధిగ్రస్తునికి గుండెపోటు వచ్చినప్పుడు, చండీగఢ్ కు చెందిన సీనియర్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ దీపక్ పూరి వైద్య సేవలు అందించారు. కార్డియాలజిస్ట్ సలహాను అనుసరించి, విమానాన్ని సమీప విమానాశ్రయం కోల్కతాకు మళ్లించారు. అక్కడ రోగిని ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం, సిబ్బంది ఐదు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించి రోగిని కాపాడారు. విమానం గమ్యస్థానానికి చేరుకునే వరకు అతను అతడిని జాగ్రత్తగా చూసుకున్నారు.
భారతీయ మీడియాతో డాక్టర్ పూరి మాట్లాడుతూ.. గుండెపోటు కార్డియాక్ అరెస్ట్కు దారితీసిందని, రోగి కొంతకాలంగా పల్స్, గుండె చప్పుడు, మెదడు ప్రతిస్పందన లేకుండా వైద్యపరంగా మరణించాడని చెప్పారు. అటువంటి పరిస్థితులలో కార్డియాక్ సహాయం ప్రారంభించకపోతే.. మూడు నుండి ఐదు నిమిషాల్లో మెదడు శాశ్వతంగా డెడ్ అవుతుందన్నారు. ప్రస్తుతం రోగి క్షేమంగా ఉన్నారని, మెదడు, కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. డాక్టర్ పూరీ రెండు రోజుల కార్డియోమెర్షన్ వరల్డ్ హార్ట్ కాంగ్రెస్కు హాజరైన తర్వాత టోక్యో నుండి తిరిగి వస్తున్నారు. ప్రయాణికుడికి గుండె ఆగిపోవడంతో డాక్టర్ పూరీ వెంటనే సహాయం కోసం వెళ్లారు. ఫ్లైట్ సిబ్బంది సహాయంతో డాక్టర్ కార్డియాక్ మసాజ్ (CPR) చేసిన తర్వాత, రోగి తేరుకున్నాడు.
కాగా, సంఘటన జరిగినప్పుడు విమానం సముద్రం పైన ఉంది. అక్కడినుంచి ఐదు గంటల దూరంలో కోల్కతా విమానాశ్రయం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు విమానయాన సంస్థ ప్రత్యేకంగా అనుమతిని ఇచ్చింది. ల్యాండింగ్ అయిన వెంటనే, అంబులెన్స్ రోగిని సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ అతని 100% బ్లాక్ అయిన ఎడమ ధమనికి వెంటనే స్టెంట్ వేయడంతో అతను బతికాడని డాక్టర్ పూరీ తెలిపారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







