నన్ను ఎవరో చదివారు
- April 09, 2015ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
ఏమి స్ఫురించిందో
పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయారు
నన్ను ఎవరో చదివారు
విద్యాబుద్దులు నేర్పిన గురువుల
చిత్రపటాలను ఎవరో తడిమి చూశారు
ఆ మూల గదిలో పడవేసినవాటిని
మళ్ళీ గోడలకు తగిలించారు
నా నడకకు సత్తువ నిచ్చే ఎముకలు కీళ్ళను
ఎవరో స్పృశించారు
నడకతీరును గమనించి
ఎవరికివారు ఊహా చిత్రాలను గీస్తుంటే
నా మేథో సంపత్తికి గర్వంతో తల ఎగరవేశాను
కళ్ళకు కనపడని గుండె కవాటాల మూలల్లో
ఎక్కడో దాగిన
గురువుల కంఠస్వరాన్ని వినిపించారు
వారి స్వరాల భుజాలపై నే వూరేగుతున్నాను
హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు
ఎన్నడూ నే గమనించకున్నా
శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి
సముద్రాల ఆవలితీరాలను ముడివేస్తున్నాయి
నేను చేసిందేమిటని తిరిగి చూశాను
ఎంత వెదకినా నాదంటూ ఏమీ లేదక్కడ
నీవు చదవటం కోసం పుస్తకాన్ని తెరిచి వుంచానంతే
ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
నా గురువులను చదివారు
--జాన్ హైడ్ కనుమూరి
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







