గద్దర్ కి దాసరి-వంశీ జీవిత సాఫల్య పురస్కారం
- May 30, 2023
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్-ఇండియా వారు, 'దాసరి వంశీ జీవిత సాఫల్య పురస్కారాన్ని' ప్రజా గాయకుడు గద్దర్ కి మే 30వ తేదీన, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాల్, ఫిలింనగర్ లో బహూకరించారు.
ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ విరాట్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు..అంతే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, 'దాసరి వంశీ ప్రతిభ పురస్కారాలను' బహూకరించారు.
దాసరి వంశీ విశిష్ట పురస్కారాలను డి సాయిబాబు సంపాదకులు వార్త, "మా" శర్మ మేనేజింగ్ ఎడిటర్ ఆంధ్ర పత్రిక కి బహూకరించారు... అంతేకాకుండా దాసరి వంశీ ప్రతిభా పురస్కారాలు, ఎమ్ ఆర్ సి వడ్లపట్ల, నిర్మాత, తిరుమల బ్యాంక్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, రచయిత నటులు సంజీవి, దర్శకులు ప్రభు, రచయిత యు వినాయకరావు, సినీ చరిత్రకారుడు సంజయ్ కిషోర్, కళాదర్బార్ సంస్థ వ్యవస్థాపకులు పొత్తూరి రంగారావు, ప్రెసిడెంట్ జాతీయ కళాకారుల సంఘం, ఎల్ వి చెన్నారావు, విరాజ్ వర్మ దర్శకులు మట్టి మనిషి షార్ట్ ఫిలిమ్, సురేందర్ ఫౌండర్ కళానిలయం మరియు షార్ట్ ఫిలిమ్ కళాకారులకు బహూకరించారు.
ముఖ్యఅతిథిగా ఎమ్. మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్ తేజ, సి. కళ్యాణ్, టి. ప్రసన్నకుమార్, మరియు దైవజ్ఞ శర్మలు పాల్గొన్నారు.
సేవ చేయటమే కానీ అవార్డ్స్ తీసుకొని వంశీ రామరాజుని సత్కరించడం మా అదృష్టం అని రామ సత్యనారాయణ గారు అన్నారు.నడిచే దర్శక పాఠశాల దాసరి, భయానికి కాంప్రమైజ్ కాను అనుకునే వ్యక్తి గద్దర్ అని దైవజ్ఞ శర్మ అన్నారు.
దాసరి దర్శకత్వం వహించిన 150 చిత్రాల్లో 30 చిత్రాల్లో నటించానని ఆయన దగ్గర నటించడం ఆర్టిస్టులకు ఎంతో సులభం అని దాసరి పేరు మీద మంచి వ్యక్తులను ఎంపిక చేసి అవార్డ్స్ బహుకరించిన వంశీ రామరాజుని మురళీమోహన్ అభినందించారు.గద్దర్ రాసిన "నీ పాదం మీద పుట్టుమచ్చ" పాట విశిష్టతను సభికులకు తెలియజేశారు.ఎక్కడో గ్రామాల్లో పాడే వ్యక్తిని తీసుకొచ్చి అవార్డు ఇవ్వడం కొత్తగా ఉంది అంటూ గద్దర్ తన ఆనందం వ్యక్తం చేశారు.. తన ప్రసంగం లో ఆశువుగా ఎన్నో గీతాలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, ఆర్ నారాయణ మూర్తి, సి కళ్యాణ్, టి.ప్రసన్నకుమార్, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆమని,సుభాష్,రాజన్ ఫల్గుల,ఎన్ శిరీష్ దాసరి చిత్రాల్లోని గీతాలు వినిపించారు.శైలజసుంకరపల్లి, సుధామయి, సుజారమణ,రమణారావు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







