హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం
- May 30, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మంగళవారం (మే 30) రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపో, దాని పక్కనే ఉన్న కార్ల షోరూమ్ లో మంటలు ఎగసిపడ్డాయి. తొలుత టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. డిపో పక్కనే ఉన్న పాత కార్ల షోరూమ్ కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 20కి పైగా కార్లు కాలిపోయాయి. అది కార్ మెన్ కార్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల గ్యారేజ్ అని తెలిసింది.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు స్థానికులను ఖాళీ చేయించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







