హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం
- May 30, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మంగళవారం (మే 30) రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపో, దాని పక్కనే ఉన్న కార్ల షోరూమ్ లో మంటలు ఎగసిపడ్డాయి. తొలుత టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. డిపో పక్కనే ఉన్న పాత కార్ల షోరూమ్ కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 20కి పైగా కార్లు కాలిపోయాయి. అది కార్ మెన్ కార్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల గ్యారేజ్ అని తెలిసింది.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు స్థానికులను ఖాళీ చేయించారు.
తాజా వార్తలు
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్









