రైలులో 59మంది పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది
- June 01, 2023
మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైలులో అక్రమంగా తరలిస్తున్న 59మంది పిల్లలను ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ కు చెందిన 59మంది చిన్నారులను దానాపూర్-పూణే ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
దీంతో ఓ ఎన్జీవో సంస్థ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం ఆ రైలు భుసావల్ స్టేషన్ కు చేరిన వెంటనే అన్ని కంపార్ట్ మెంట్లను తనిఖీ చేశారు. మొదటగా ఆ స్టేషన్ లో 29 మంది పిల్లలను కాపాడారు. ఆ తర్వాత మన్మాడ్ స్టేషన్ కు ఆ రైలు చేరగా మరో 30మంది పిల్లలను రక్షించారు.
8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్జీవో సిబ్బంది, పోలీసుల సహకారంతో పిల్లల అక్రమ రవాణాను అరికట్టినట్లు ఆర్పీఎఫ్ వెల్లడిస్తూ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







