సైబర్ ఫ్రాడ్ గురించి హెచ్చరించిన అబుధాబి పోలీసులు
- June 02, 2023
యూఏఈ: మోసపూరిత కాల్లు, మోసపూరిత వెబ్సైట్లు, వాటి లింక్ల పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు మెసేజ్ లు, కాల్స్, నకిలీ వెబ్సైట్ లింక్ల ద్వారా మోసపూరిత ప్రకటనలు, సేవలు పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తారని, అనంతరం బ్యాంకు అకౌంట్ల వివరాలను తస్కరిస్తారని అబుధాబి పోలీసులు సూచించారు. బ్యాంక్ ఖాతా లేదా బ్యాంక్ కార్డ్ సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ATM పిన్లు, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) నంబర్ లేదా పాస్వర్డ్లతో సహా తమ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ ఖతాల వివరాలను బ్యాంక్ ఉద్యోగులు అడగరని, వివరాలను అప్డేడ్ చేసుకోవాలని సూచించారని పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు గురైన బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్ట్ చేయాలని, అమన్ సెక్యూరిటీ సర్వీస్ నంబర్ 8002626ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









