కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- June 04, 2023కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జూన్ 1న మూడు కొత్త బయోమెట్రిక్ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో కువైటీలు, గల్ఫ్ దేశస్థుల కోసం కేటాయించిన మొత్తం బయోమెట్రిక్ కేంద్రాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ కేంద్రాలు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కువైటీలు, GCC పౌరుల కోసం బయోమెట్రిక్ కేంద్రాలను హవలీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ముబారక్ అల్కబీర్ సెక్యూరిటీ డైరెక్టరేట్, జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ లలో ఏర్పాటు చేశారు. నివాసితుల అలీ సబా అల్-సలేం, జహ్రా ప్రాంతాల్లో బయోమెట్రిక్ కేంద్రాలను నెలకొల్పారు.
పౌరులు, నివాసితులు తమ బయోమెట్రిక్ నమోదు కోసం ఈ కేంద్రాలలో సహేల్ యాప్ (మాతా ప్లాట్ఫారమ్) ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ రిలేషన్స్, మీడియా డైరెక్టరేట్ జనరల్ వివరించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!