మస్కట్లో పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం
- June 07, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో సుమారు 3,000 బ్యాగుల నమిలే పొగాకును స్వాధీనం చేసుకున్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA)లోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూయింగ్ పొగాకు తయారీ, అమ్మకం కోసం ముడి పదార్థాలుగా వినియోగిస్తున్న దాదాపు 3,000 బ్యాగుల పొగాకును స్వాధీనం చేసుకున్నారు. ఖురయ్యత్లో ఈ పొగాకు తయారీ, వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ప్రవాస కార్మికుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖురయ్యాత్ విలాయత్లోని పారిశ్రామిక ప్రాంతంలో పొగాకును రవాణా చేయడానికి ఉపయోగించే స్థలం గురించి నోటిఫికేషన్ను అందుకుందని, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటిఫికేషన్ సైట్కు వెళ్లారని అధికారులు వెల్లడించారు. పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. ప్రవాస కార్మికుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు తెలిపారు. విచారణలో కార్మికుడు మరొక ప్రవాస కార్మికుడి నుండి ముడి పదార్థాలను కొనుగోలు చేసిన తర్వాత పొగ లేని నమిలే పొగాకు తయారీ మరియు వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వినియోగదారుల రక్షణ చట్టం, రిజల్యూషన్ నెం. (256/2015) కేసు నమోదు చేసారు. రిజల్యూషన్ నెం. (301/2016) ద్వారా సవరించబడిన నిబంధన ప్రకారం నమిలే పొగాకు (పొగ లేనిది )పై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !