మస్కట్లో పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం
- June 07, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో సుమారు 3,000 బ్యాగుల నమిలే పొగాకును స్వాధీనం చేసుకున్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA)లోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూయింగ్ పొగాకు తయారీ, అమ్మకం కోసం ముడి పదార్థాలుగా వినియోగిస్తున్న దాదాపు 3,000 బ్యాగుల పొగాకును స్వాధీనం చేసుకున్నారు. ఖురయ్యత్లో ఈ పొగాకు తయారీ, వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ప్రవాస కార్మికుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖురయ్యాత్ విలాయత్లోని పారిశ్రామిక ప్రాంతంలో పొగాకును రవాణా చేయడానికి ఉపయోగించే స్థలం గురించి నోటిఫికేషన్ను అందుకుందని, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటిఫికేషన్ సైట్కు వెళ్లారని అధికారులు వెల్లడించారు. పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. ప్రవాస కార్మికుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు తెలిపారు. విచారణలో కార్మికుడు మరొక ప్రవాస కార్మికుడి నుండి ముడి పదార్థాలను కొనుగోలు చేసిన తర్వాత పొగ లేని నమిలే పొగాకు తయారీ మరియు వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వినియోగదారుల రక్షణ చట్టం, రిజల్యూషన్ నెం. (256/2015) కేసు నమోదు చేసారు. రిజల్యూషన్ నెం. (301/2016) ద్వారా సవరించబడిన నిబంధన ప్రకారం నమిలే పొగాకు (పొగ లేనిది )పై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







