యూఏఈ , జిసిసి సందర్శకులకు యూకే బంపర్ ఆఫర్..!

- June 07, 2023 , by Maagulf
యూఏఈ , జిసిసి సందర్శకులకు యూకే బంపర్ ఆఫర్..!

యూఏఈ :యూకే కొత్త ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) స్కీమ్‌ను ప్రవేశపెట్టడంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలు మరియు జోర్డాన్ జాతీయులకు యూకే ప్రయాణం త్వరలో చౌకగా మారనుంది.  ఒక్కో ప్రయాణికుడికి £10 (Dh45.50) మాత్రమే ఖర్అవుతుంది. ప్రస్తుతం యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుండి UKకి వెళ్లే  సందర్శకులు ప్రస్తుత ఎలక్ట్రానిక్ వీసా వేవియర్ (EVW) పథకం ప్రకారం ప్రతి సందర్శనకు £30 (Dh137) చెల్లిస్తున్నారు.అదే  జోర్డానియన్లు విజిట్ వీసా కోసం £100 (Dh456) చెల్లిస్తున్నారు. కొత్త ETA అనేది UKని సందర్శించే లేదా ట్రాన్సిట్ చేసే వారి కోసం చిన్న బస కోసం వీసా అవసరం లేని లేదా ప్రస్తుతం మరొక UK వీసాని కలిగి ఉండని వారికి ప్రయాణించడానికి డిజిటల్ అనుమతి. కొత్త ETAతో వారందరూ రెండు సంవత్సరాల వ్యవధిలో UKని అనేకసార్లు సందర్శించడానికి అనుమతించబడతారు.

UK ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒక పోస్ట్ ప్రకారం, కొత్త పథకం ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ జాతీయులకు మరియు మిగిలిన GCC రాష్ట్రాలు మరియు జోర్డాన్‌లకు ఫిబ్రవరి 2024లో.. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి  రానుంది.

ETA కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
వెబ్‌సైట్ లేదా మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉండటంతో ETA కోసం దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం మరియు వేగంగా పూర్తి అవుతుంది. దరఖాస్తు చేయడానికి, వ్యక్తులు డిజిటల్ ఫోటోగ్రాఫ్ వంటి బయోగ్రాఫిక్, బయోమెట్రిక్ వివరాలను అందించాలి.

పర్యాటకానికి సహకారం
UK ఇమ్మిగ్రేషన్ మంత్రి రాబర్ట్ జెన్రిక్ మాట్లాడుతూ.. గల్ఫ్ రాష్ట్రాలు, జోర్డాన్ నుండి వచ్చే సందర్శకులు UK పర్యాటక పరిశ్రమకు భారీ సహకారం అందిస్తారు. కొత్త ETA పథకం వారు UKకి ప్రయాణించడాన్ని సులభతరం చేస్తుందన్నారు. 790,000 మంది గల్ఫ్ సందర్శకులు గత సంవత్సరం UKలో ఉన్న సమయంలో దాదాపు £2 బిలియన్లు (Dh9.12 బిలియన్) ఖర్చు చేశారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com