విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
- June 10, 2023
హైదరాబాద్: విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర అధికారులు వాహనాలు తనిఖీ చేశారు.
అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించారు.
వారు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో మరో డీఆర్ఐ బృందం తనిఖీలు చేపట్టింది. 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







