విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
- June 10, 2023
హైదరాబాద్: విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర అధికారులు వాహనాలు తనిఖీ చేశారు.
అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించారు.
వారు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో మరో డీఆర్ఐ బృందం తనిఖీలు చేపట్టింది. 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- రికాల్ నెస్లే బేబీ మిల్క్ ఉత్పత్తులపై ఒమన్ హెచ్చరిక..!!
- బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ మెసేజుల హల్చల్..అలెర్ట్ జారీ..!!
- జెడ్డా కార్నిచ్లో 63 సీ బర్డ్స్ రిలీజ్..!!
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!







