తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభం..
- June 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం (జూన్12,2023) రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు.
జంట నగరాల్లో ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి. ప్రతి నెల నాలుగో శనివారం నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ చేరుకున్నాయి. త్వరలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని విద్యా శాఖ అధికారులు అంటున్నారు. అలాగే, ఈ ఏడాది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నోట్ బుక్స్ కూడా అందించనుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









