హైదరాబాద్లో ఈ సమావేశాలు జరుగుతాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 12, 2023
హైదరాబాద్: భారత దేశంలో జీ 20 సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అనేక అంశాలపై చర్చలకు భారత్ వేదికైందని తెలిపారు. 46 రంగాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 75 శాతం గ్లోబల్ ట్రేడ్ జీ20 దేశాల నుంచి జరుగుతోందని తెలిపారు.
హైదరాబాద్ హైటెక్ సిటీ వేదికగా ఈ నెల 15 నుంచి 17వరకు జరిగే సమావేశాలకు జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్ లో జీ20లో భాగంగా నిర్వహించే వ్యవసాయ సమావేశాల్లో ఇక్రిశాట్ కూడా పాల్గొంటుందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయన్నారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు. టూరిజం చివరి సమావేశాలు జూన్ 19, 20, 21, 22 తేదీల్లో గోవాలో జరుగుతాయని తెలిపారు.
గోవా రోడ్ మ్యాప్ పేరుతో డ్రాఫ్ట్ ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాంస్కృతిక శాఖ తుది సమావేశాలు వారణాసిలో జరుగుతాయని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







