ఒమన్ విమానాశ్రయాలను ఉపయోగించిన 3 మిలియన్ల మంది ప్రయాణికులు
- June 13, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాలను వినియోగించుకుంటున్న ప్రయాణీకుల సంఖ్య 2023 మార్చి చివరి నాటికి 3 మిలియన్లకు పైగా పెరిగింది. నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన ప్రాథమిక గణాంకాల నివేదిక ప్రకారం.. మార్చి 2023 చివరి వరకు ఒమన్ సుల్తానేట్ మానాశ్రయాల ద్వారా ప్రయాణీకుల సంఖ్య 88 శాతం పెరిగింది. 3,287,015 మంది ప్రయాణికులు నమోదయ్యారు. 2022లో ఇదే కాలంలో 1,746,259 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్చి 2023 చివరి నాటికి మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య 2,959,829 మందికి చేరుకుంది. మార్చి 2022 చివరి వరకు 1,473,818 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది 100.8 శాతం పెరిగింది. విమానాశ్రయం ద్వారా విమానాల సంఖ్య కూడా 93.9 శాతం పెరిగి 22,145 విమానాలకు చేరుకుంది. మార్చి 2022 చివరి నాటికి వీటి సంఖ్య 11,419 విమానాలుగా ఉంది. సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 34.2 శాతం పెరిగి 2,184 విమానాలలో 304,538 మంది ప్రయాణికులకు చేరుకుంది. 2022లో ఇదే కాలంతో పోలిస్తే విమానాల సంఖ్య 33.2 శాతం పెరిగింది. సోహార్ విమానాశ్రయం ద్వారా అదే సమయంలో 76 విమానాల్లో 5,401 మంది ప్రయాణికులు చేరుకోగా, దుక్మ్ విమానాశ్రయం ద్వారా 152 విమానాల్లో 17,247 మంది ప్రయాణించారని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







