32 మిలియన్ దిర్హామ్ల ఆన్లైన్ స్కామ్: 30 మంది సభ్యుల ముఠాకు 96 ఏళ్ల జైలు
- June 13, 2023
యూఏఈ: వ్యక్తులు, కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ స్కామ్ కు పాల్పడి32 మిలియన్ దిర్హామ్లను అపహరించిన కేసులో 30 మంది సభ్యుల ముఠా, ఏడు కంపెనీలు దోషులుగా తేలాయి. దుబాయ్లోని మనీలాండరింగ్ కోర్టు ముఠాలోని 30 మంది సభ్యులకు కలిపి మొత్తం 96 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. 32 మిలియన్ దిర్హామ్ల జరిమానాను ఉమ్మడిగా చెల్లించాలని నిందితులను కోర్టు ఆదేశించింది. నేరానికి ఉపయోగించిన కంప్యూటర్లు, ఫోన్లను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏడు కంపెనీలకు కలిపి మొత్తం Dh700,000 జరిమానా విధించింది. జరిమానాను కవర్ చేయడానికి కోర్టు ప్రతివాదులకు చెందిన నిధులు లేదా ఆస్తులను జప్తు చేయవచ్చని తెలిపింది. బాధితులకు 118,000 ఫిషింగ్ ఇమెయిల్లను పంపడం ద్వారా ముఠా డబ్బును దొంగిలించిందని సీనియర్ అడ్వకేట్ జనరల్ మరియు పబ్లిక్ ఫండ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ కౌన్సెలర్ ఇస్మాయిల్ మదానీ చెప్పారు.
మనీలాండరింగ్ నేరాలను పరిశోధించడానికి యూఏఈ ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. వామ్ నివేదిక ప్రకారం, నవంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు చట్ట అమలు సంస్థలు 122 కొత్త కేసులను నమోదుచేశాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 109 కేసులను విచారించారు. ఈ కాలంలో యూఏఈ మనీలాండరింగ్ కేసులలో 94 శాతం నేరారోపణ రేటును కొనసాగించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







